”శోధిని”

Monday 14 May 2018

దేవదేవుడు

వేంకటేశ్వరస్వామిని అలంకార రహితంగా నిజరూపంలో దర్శించడం ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతి. ఎందుకంటే ఆ సమయంలో స్వామివారిలో దేదీప్యమానంగా ప్రకాశించే వర్చస్సు తొంగి చూస్తూ, భక్తుల్ని మరింత పారవశ్యంలో ముంచెత్తుతుంది. శ్రీవారి పాదాల దగ్గర్నుంచి నేత్రలదాకా ఉట్టిపడే ఆ శోభను తికించే అవకాశం ఒక్క శుక్రవారం అభిషేకం సమయంలో మాత్రమే లభిస్తుంది. మంగళకరమైన దివ్యకాంతియుక్తమైన శ్రీనివాసుణ్ణి చూసి పరమానందభరితులవుతారు. స్వామివారిది అతిలోక సౌందర్యంతో విలసిల్లే అత్యద్భుత దివ్య మంగళ విగ్రహం. అద్భుత రూపలావణ్యంతో తీర్చిదిద్దినట్టుండే మోముతో మందస్మిత వదనంతో ఉండే శ్రేనివాసుడు, నమ్మి కొలిచే వారికి కొండంత వరాలిచ్చే దేవదేవుడు.


No comments: