స్మార్ట్ ఫోన్, వాట్సఫ్, పేస్ బుక్ లాంటి సాధనాలను సరిగా వినియోగించకపోతే పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది. వీటి ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులు పండంటి కాపురాల్లో కలతలు రేపుతున్నారు. దాంతో దంపతుల మధ్య అనుమానపు పొరలు పెరిగి, నిండు సంసారాలు పెటాకులు అవుతున్నాయి. ముఖ్యంగా కొత్త కాపురాలలో ఇలా జరుగుతుండటం విచారకరం. అందుకే పై సాధనాలు ఉపయోగించేటప్పుడు మిత్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
Wednesday, 25 May 2016
పచ్చని కాపురాలలో చిచ్చు !
స్మార్ట్ ఫోన్, వాట్సఫ్, పేస్ బుక్ లాంటి సాధనాలను సరిగా వినియోగించకపోతే పచ్చని సంసారంలో చిచ్చుపెట్టే ప్రమాదం ఉంది. వీటి ద్వారా పరిచయమైన కొందరు వ్యక్తులు పండంటి కాపురాల్లో కలతలు రేపుతున్నారు. దాంతో దంపతుల మధ్య అనుమానపు పొరలు పెరిగి, నిండు సంసారాలు పెటాకులు అవుతున్నాయి. ముఖ్యంగా కొత్త కాపురాలలో ఇలా జరుగుతుండటం విచారకరం. అందుకే పై సాధనాలు ఉపయోగించేటప్పుడు మిత్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
Sunday, 22 May 2016
మత్తెక్కించే మల్లెలు !
వేసవికాలం వచ్చిందంటే చాలు మల్లెపూలు తమ సుగంధాలతో పరిసరాలను నింపేస్తాయి. మనసును సమ్మోహన పరచి ఏదో లోకాలకు తీసుకెలతాయి. ఎండ ఎంత తీవ్రంగా ఉన్నా సాయంకాలం అయ్యేసరికి మల్లెలను చూడగానే మనసంతా ఆహ్లాదం నిండి మోహనరాగం పలికిస్తుంది. మధురానుభూతో మది సన్నాయిగీతం ఆలపిస్తుంది. పరిమళానికి మారుపేరయిన పరిమళభరిత మల్లెలంటే అందరికీ ఇష్టమే!
అంతేకాదు మనసును రంజింపజేసే మల్లెల గుబాళింపు చల్లదనానికి, కమ్మదనానికి పెట్టింది పేరు.
Thursday, 19 May 2016
కొబ్బరి బొండాంలు!
సహజసిద్ధమైన, స్వచ్చమైన లవణాలు, విటమిన్లతో నిండిన అమృతపానీయం కొబ్బరి నీళ్ళు. వయసురీత్యా వచ్చే ఉగ్మతలను ఈ కొబ్బరి నీళ్ళు నివారించగలవు. అందుకే కొబ్బరి చెట్టును 'కల్ప వృక్షం' అన్నారు పెద్దలు. కొబ్బరి నీళ్ళు దాహాన్ని తీర్చే గుణంతో పాటు శరీరాన్ని చల్లపరచే గుణం కూడా ఉండటంతో వీటి ధర కొండెక్కి కూర్చుంది. వ్యాపారస్తులు పది రూపాయలకు రైతుల దగ్గర కొని, మనకు ఇరవయి ఐదు రూపాయలకు అమ్ముతున్నారు. ఫలితంగా అటు కష్టపడి పండించిన రైతులు, ఇటు ఇరవయి ఐదు రూపాయలకు కొన్న ప్రజలు నష్టపోతున్నారు. వ్యాపారస్తులు మాత్రం జేబులు నింపుకుంటున్నారు.
Tuesday, 17 May 2016
దొరికితే దొంగలు !
ప్రజాస్వామ్యంలో
ఎవరైనా తమకు నచ్చిన పార్టీలో చేరే స్వేచ్చ ఉంటుంది. కానీ, ఒక పార్టీ
నుంచి గెలుపొంది మరో పార్టీలో చేరడం అనైతికం. అప్రజాస్వామ్యం. ఒకవేళ
పార్టీ మారాల్సిన పరిస్థితి వస్తే, తాను గెలిచిన పార్టీకి,
శాసనసభ్యత్వానికి రాజీనామా చేయడం కనీస ధర్మం. ఒక పార్టీ నుంచి ఎన్నికై,
ఆతర్వాత మరో పార్టీలో చేరడం ప్రజా తీర్పును కాలరాచినట్లే అవుతుంది. ఒక
పార్టీ సిద్ధాంతాలను అనుసరించి గెలిచిన తర్వాత మరో పార్టీలోకి వెళుతుంటే,
ప్రశ్నించేవారు కరువయ్యారు. దీంతో అధికారం, ప్రలోభాలకు లొంగిపోయి
విచ్చలవిడిగా పార్టీలు మార్చేస్తున్నారు. ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓటు
వేస్తారు. వారిని కాదని ఎదో ప్రలోభాలకు లోనై, పార్టీలు మార్చడం ప్రజలను
మోసం చేసినట్లే అవుతుంది. ఇది ఏ ఒక్క పార్టీని వేలెత్తి చూపడం లేదు.
మనదేశంలోని రాజకీయపార్టీలు ఇదే పద్దతిని ఎన్నుకోవడంతో దేశంలో అయోమయ
పరిస్థితి నెలకొంది. కాళ్ళు నొప్పులు పుట్టే విధంగా ఊరూరు తిరిగి, వంద
రూపాయలను పెట్టి ఓటర్లను కొనడం కన్నా, స్టార్ హోటల్లో కూర్చొని గెలిచిన
అభ్యర్థికి లక్షలు పోసి తన వైపుకు తిప్పుకోవడం సులభమైన పని. అందుకే అందరూ
ఈ పద్దతిని ఎంచుకొంటున్నారు. అడ్డంగా దొరికిపోయినవాళ్ళు దొంగలు.
చాకచక్యంతో వ్యవహరించి దొరకనివాళ్ళు దొరలు. అభ్యర్థులను తనవైపు తిప్పుకొనే
విషయంలో విఫలం చెందినవాళ్ళు నీతిమంతులు. ప్రశ్నించే ప్రజలు మౌనంగా
ఉన్నంతకాలం ఇలాంటి నీచమైన ఫిరాయింపుల రాజకీయాలు కొనసాగుతూనే ఉంటాయి.
Saturday, 7 May 2016
Wednesday, 4 May 2016
Saturday, 30 April 2016
"నేడే ...మేడే"
దేశాభివృద్ధి కోసం... శ్రామికుడు !
దేశ రక్షణ కోసం... సైనికుడు !!
కార్మికుల శ్రమను దోచుకోవడానికి... ప్రైవేట్ సంస్థలు !!!
దేశ రక్షణ కోసం... సైనికుడు !!
కార్మికుల శ్రమను దోచుకోవడానికి... ప్రైవేట్ సంస్థలు !!!
దేశంలో పేరుకు పెద్ద కంపెనీలుగా చెలామణి అవుతున్న కార్పోరేట్ సంస్థలు కార్మికులను పీల్చి పిప్పి చేస్తున్నాయి. ఈ సంస్థలలో పనిచేసే కార్మికులకు కంటినిండా నిద్రలేక, సమయానికి తిండి లేక ఆరోగ్యాలను పాడుచేసుకుంటున్నారు. కార్పోరేట్ సంస్థల కబంధహస్తాలలో ఎందరో కార్మికులు చిక్కుకొని రోదిస్తున్నారు. ఇది నిత్యం జరుగుతున్న సత్యం. ఇలాంటి కార్మికుల జీవితాలలో వెలుగును నింపిన రోజే నిజమైన ప్రపంచ కార్మిక దినోత్సవం.
Subscribe to:
Posts (Atom)