కామాక్షి అమ్మవారి దేవాలయం కంచి లో
ఉన్న ప్రముఖ దేవాలయం. ఇక్కడ ప్రతిరోజూ ప్రాతఃకాలంలో శ్రీ కామాక్షి దేవి ఉత్సవ
మూర్తిని మేలుకొలిపి, ప్రాతఃకాల నైవేధ్యం సమర్పించి హారతి ఇచ్చి, కామాక్షిదేవి
ఉత్సవ మూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత
కామాక్షి దేవికి ఎదురుగా గోపూజ చేస్తారు. గోపూజ అయిన తర్వాత అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలిగించి హారతి
యిస్తారు. మనం అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. శ్రీ కామాక్షి దేవి దివ్య
మంగళ రూపం నయన మనోహరం.
Monday, 7 January 2019
Friday, 4 January 2019
Wednesday, 2 January 2019
అత్యంత పవిత్ర స్థలం రామేశ్వరం
Monday, 31 December 2018
Thursday, 27 December 2018
ఈ రోజు మధుర మీనాక్షి అమ్మవారి దర్శనం...
దేశవ్యాప్తంగా ఉన్న అతి పవిత్ర, పురాతన దేవాలయాల్లో మధుర మీనాక్షి ఆలయం ఒకటి. ఈ ఆలయానికి నాలుగు ముఖ ద్వారాలు ఉన్నాయి. ధర్మ, అర్ధ, కామ, మోక్ష ద్వారాలుగా వీటిని పిలుస్తారని పురాణ గాథలు. ఎత్తైన ఈ ఆలయ గోపుర శిఖరాలు నగరానికి గుర్తింపుగా నిలిచాయి. హిందువులు పవిత్రంగా పూజించే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు నిత్యం మీనాక్షి అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. ఇక మీనాక్షి అమ్మవారు మదురైలో వెలిసిన వైనాన్ని చూస్తే.... తను ఇచ్చిన మాటకోసం భూలోకం చేరిన పార్వతి మదురై రాజుకు కుమార్తెగా జన్మించి మీనాక్షి నామధేయంతో పెరిగి పెద్దదైంది.పరమశివుడు సుందరేశ్వరునిగా భూలోకంలో జన్మించి మదురై వచ్చి మీనాక్షీ అమ్మవారిని వివాహమాడాడడని.. అనంతరం వీరు మదురై రాజ్యాన్ని చాలా ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించారని భక్తులు విశ్వసిస్తారు. ఆ తర్వాత ఇరువురు ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి.
Friday, 21 December 2018
స్వామివారి నిత్యకళ్యాణం
తిరుమల కొండ పరమ పావనమైనది. బ్రహ్మమయమైనది. సచ్చిదానంద స్వరూపమైనది. పరమాత్ముడైన వెంకటాచలపతి దివ్యపాదస్పర్శతో పునీతమైనది. తిరుపతి కొండ యొక్క ఆణువణువూ భగవత్స్వరూపం. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రాన్ని ప్రతి భక్తుడూ దర్శించి శ్రీ వేంకటేశ్వరుడు కృపకు పాత్రులవ్వాలి. పద్మావతీ దేవి పేరుతొ మొదలైన స్వామివారి కళ్యాణం. ప్రతి నిత్యం శ్రీదేవి భూదేవిలతో జరుగుతూ ఉండటం విశేషం.
Thursday, 20 December 2018
పచ్చదనం...మనసుకు ఆహ్లాదకరం!
పచ్చదనం మనసును ప్రభావితం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించి, ఆందోళనల్ని దూరం చేస్తుంది. మొక్కలు చల్లదనాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని మనకు అవసరమయ్యే ప్రాణవాయువునిచ్చి, మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అంతేకాదు నిత్యం పచ్చదనాన్ని చూస్తుంటే కంటి చూపు మెరుగవుతుంది. అందుకే, మన చుట్టూ వున్న పరిసరాలను మొక్కలు నాటి పచ్చదనాన్ని నింపుదాం !
Subscribe to:
Posts (Atom)







