రాష్ట్రంలోమండుతున్న ఎండలకు తోడు తాగడానికి మంచి నీరు దొరక్క ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. డబ్బున్నవారు నీటిని కొనుక్కొని తాగితే, పేదప్రజలు మాత్రం ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. డిమాండుకు అనుగుణంగా ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయలేక పోతున్నారు. సిబ్బంది, ట్యాంకర్ డ్రైవర్స్ కుమ్మకై నీటిని దారి మల్లిస్తూ, అవినీతికి పాల్పడుతుండటంతో ప్రజల గొంతులు తాడారిపోతున్నాయి. పట్టణాలలోనే కాకుండా గ్రామాలలోనూ ఎదే పరిస్థితి. ప్రభుత్వం పైన నమ్మకం లేక చాలా మంది తినడానికి తిండి లేకపోయినా తాగేందుకు మినరల్ వాటర్ క్యాన్లను ఆశ్రయిస్తున్నారు. కనీసం తాగేందుకు మంచినీటిని కూడా ఇవ్వలేని ధీన స్థితిలో ప్రభుత్వం ఉన్నదంటే పరిస్థితి ఎంత ధారుణంగా వుందో అర్థమవుతోంది. ఒకప్రక్క నీటి వ్యాపారులు యథేచ్ఛగా భూగర్భ జలాలను తోడేస్తుంటే భూగర్భం తడారిపోయింది. మరోప్రక్క బోర్లు ఎండిపోయి చుక్క నీరు రావడంలేదు. నాయకులందరూ ఉపఎన్నికల పైన దృష్టి పెట్టడంతో ప్రజల నీటి కష్టాలను తీర్చే వారు కరువయ్యారు. ప్రభుత్వం వున్నా లేనట్టుగా కనిపిస్తోంది. ఇక ఆ వానదేవుడే ప్రజలపైన కరుణ చూపాలి.
Thursday 31 May 2012
Saturday 26 May 2012
రియల్ హీరో
' NTR 'ఈ పేరే ఒక ప్రభంజనం. ఒక సంచలనం.
మంచి మానవతల మేలుకలయిక నందమూరి తారక రామారావు.
పట్టుదల, కార్యదీక్ష ఆయన సొత్తు.
ఆంధ్రరాష్ట్రానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు సాధించి పెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది.
ఆంద్రుల అభిమానానికి, ఆత్మగౌరవానికి ఆయన మారుపేరు.
ప్రేక్షకులే నా ఆరాధ్య దైవం అని భావించే నందమారి చేసిన ప్రతి విన్యాసం జనబాహుళ్యాన్నిఉర్రూత లూపింది.
సినిమా రంగంలో ఆయన పాటించిన క్రమ శిక్షణ ఎందరికో మార్గదర్శకమైంది.
నటుడిగా, దర్శకుడిగా, ముఖ్యమంత్రిగా తెలుగు జాతి మన్నలను పొందారు. సాంఘీక, జానపద,పౌరాణిక, చారిత్రిక చిత్రాలలో నటించి, సినీమానవ సరోవరంలో నిరంతరం విహరించే నట సింహం.
తెలుగు సినీ నందనవనంలో వెల్లివిరిసిన నవరస పరిమళ భరిత పారిజాతపుష్పం. అన్నిరకాల పాత్రలలో నటించి ప్రజల మన్నలను పొందారు.
నమ్మిన వారిని ఆదరించడంలో ఆయనకు ఆయనే సాటి.
నిక్కచ్చగా, నిజాన్ని దాచకుండా చెప్పడం ఆయన వ్యక్తిత్వంలో ఒక విశేషం.
ఆత్మీయతను పంచడంలో తన పరభేదం లేకుండా ప్రేమను చూపించగలిగే ప్రేమశీలి.
1983 లో 'తెలుగుదేశం' పార్టీని స్థాపించి, కేవలం 9 నెలలలోనే ముఖమంత్రి పీఠం అధిష్టించి, తెలుగువారి ఆత్మాభిమానం, పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనుడు... దేశంలోనే అత్యంత శక్తివంతమైన ఇందిరాగాంధి నే 'డీ' కొన్న యోధుడు NTR.
ఖండాంతరాలకు తెలుగు మాధుర్యాన్ని చవి చూపించారు. అటు సినీరంగంలోనూ...ఇటు రాజకీయరంగంలోనూ తనదైన ముద్రవీసిన రామారావు గారునిజంగా రియల్ హీరో. ఆయన సామాన్యుడు కాదు ...ఒక మహాశక్తి .
ఎన్నో విశిష్టలున్న మహామనిషి.సినీరంగంలో శ్రీరాముడుగా , శ్రీ కృష్ణుడుగా, కర్ణుడుగా , దుర్యోధనునిగా, రావణాసురుడుగా వేసిన పాత్రలు అమోఘం. ఆ పాత్రలకు ఆయన ప్రాణం పోశారు.
సాహసాలు చేయడంలో ఆయనకి ఆయనే సాటి.
అందుకు ఉదాహరణ రావణబ్రహ్మ పాత్ర.
ఏదయిన ప్రయోగం చేయాలంటే , ముందుగా ఆయనమీదే చేసుకునేవారు.
'దాన వీర శూర కర్ణ ' చిత్రంలో మూడు పాత్రలు వేసి శభాష్ అనిపించారు.
శ్రీమద్విరాటపర్వం లో ఏకంగా అయిదు పాత్రలు వేసి గొప్ప సాహసం చేసి విజయం సాధించారు. ఇలాంటి సాహసం మరే నటుడికి సాధ్యం కాదు అంటే అతిశయోక్తి కాదు. నటనలో లీనమై ప్రతిపాత్రకు న్యాయం చేకూర్చిన నటుడు. దాదాపు మూడువందల చిత్రాలలో నటించి, తెలుగువారి హృదయాలలో పదిలంగా స్థానం ఏర్పరచుకున్న NTR ధరించని పాత్ర లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, నేషనల్ ఫ్రెంట్ చైర్మన్ గా , జాతీయస్థాయి నాయకుడిగా రామారావు గారు కీర్తి శిఖరం అధిరోహించారు.
మాడున్నర దశాబ్దాలపాటు తెలుగు చలన చిత్రరంగంను ఏకచత్రాదిపతిగా పాలించి, పన్నెండు సంవత్సరాల రాజకీయనాయకుడిగా విశ్వకీర్తిని సాధించారు.
మరపురాని మరువలేని మహా నటుడు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు జయంతి (మే 28) సందర్భంగా....
Wednesday 23 May 2012
పెట్రో మంటలు
ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అలమటిస్తుంటే , గోరు చుట్టుమీద రోకలి పోటులా కేంద్ర ప్రభుత్వం మళ్లీ పెట్రో ధరలు విపరీతంగా పెంచి ప్రజలపై మరింత భారాన్ని మోపారు. దేశంలో మండుతున్న ఎండలకు పెట్రో మంటలు తోడవడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు గుండె దడ పుట్టిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా, ఏ ప్రభుత్వం పెంచలేనంత పెట్రో ధరలు పెంచి యు.పి.ఏ ప్రభుత్వం రికార్డు స్థాపించింది . భారీగా పెరిగిన పెట్రో ధరల పెంపువల్ల తాజాగా నిత్యావసర వస్తువులతో పాటు బస్సు, ఆటో చార్జీలు పెరగనున్నాయి. ఫలితంగా ప్రజలపై పెనుభారం పడే అవకాశం వుంది. పెంచిన ధర ప్రకారం హైదరాబాద్ లో రేపటినుంచి లీటరు పెట్రోలు ధర Rs.81/- రూపాయలు.` కేంద్ర ప్రభుత్వం ప్రజల బాధలను గుర్తించి, పెట్రో ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి.
Subscribe to:
Posts (Atom)