పవిత్రతకు, శుభానికి చిహ్నం గోవు. సకల దేవతలు తన శరీరంలో కొలువై వున్న గోమాత, ప్రత్యక్ష దైవంగా హిందువులచేత పూజలందుకుంటోంది. మన సంప్రదాయంలో గోమాతను పూజించడం గొప్ప ఆచారం. గోమాతను దర్శించినా, స్పర్శించినా కోటి పుణ్యాలు లభిస్తాయని మన వేదాలు చెబుతున్నాయి. అందుకే గోమాతను సకలదేవతా స్వరూపముగా భావించి పూజిస్తే, పుణ్యఫలం దక్కుతుందంటారు.