”శోధిని”

Saturday 8 February 2014

ప్రకృతి పరవశం!

 
జనవరి నెలలో ఉదయం లేవగానే మంచు కురుస్తూ ఉంటుంది. చెట్ల ఆకుల మీద... పంటపొలాల పైన ...పుష్పాల మీద ... గడ్డి పరకల పైన హిమబిందువులు ముత్యాల్లా అలరించాయి.  నెల రోజుల పాటు మంచు బిందువుల స్పర్శకు ప్రకృతి పరవశించి పులకించి పోయింది.  పరిసరాలన్నీ తన్మయత్వంతో మధురానుభూతులను తమలో పదిలంగా నింపుకున్నాయి.  ప్రిబ్రవరి నెల రాగానే ఆ అద్భుత దృశ్య రూపం కనుమరుగవుతూ వస్తోంది.  మళ్ళీ మనం ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలన్నా... ఆస్వాదించాలన్నా ఏడాది వరకు ఆగాల్సిందే!

"గుడిసెలు లేని రాష్ట్రం!


"గుడిసెలు లేని రాష్ట్రం మన రాష్ట్రం" - ఈ మధ్య  బస్సుల పైన ఈ ప్రకటన దర్శనమిచ్చింది.  కానీ , వాస్తవానికి మన రాష్ట్రంలో లక్షల్లో ఇలాంటి గుడిసెలు కనపడతాయని   ఆలస్యంగా తెలుసు కున్నారేమోగాని, ఈ ప్రకటనను కొద్ది మార్పులు చేసి మళ్ళీ ఇప్పుడు "గుడిసెలు లేని రాష్ట్రం ... అదే మన లక్ష్యం " అని ప్రచారం చేస్తున్నారు. ఈ  ప్రకటన మూడోసారి కూడా  మారవచ్చు.  ఎందుకంటే ఫుట్ ఫాత్ మీద నివాసముంటున్న ఎందరో నిరుపేదలకు కనీసం తలదాచుకోవడానికి గుడిసె కూడా లేదు పాపం