”శోధిని”

Tuesday 17 July 2012

వర్షాకాలంలో కరెంట్ కోతలా?




        మన రాష్ట్రంలో వర్షాకాలంలోనూ కరెంట్ కోట కొనసాగుతోంది.  ఫలితంగా విద్యుత్ ను నమ్ముకుని జీవిస్తున్న వినియోగదారులు, పరిశ్రమ యజమానులు తీవ్రఆందోళనచెందుతున్నారు.  ఎండాకాలం లో రోజుకు రెండు గంటలు కోట విధించిన అధికారులు , వర్షాకాలం వచ్చేసరికి ఒక సమయం లేకుండా ఎప్పుడంటే అప్పుడు కరెంట్ ను నిలిపివేసి వినియోగదారులకు నరకం చూపిస్తున్నారు.  ఇప్పటికే విద్యుత్ చార్జీలతో సతమత మవుతున్న ప్రజలకు ఈ కోత వల్ల పుండుమీద కారం చల్లినట్టుంది.ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది.

         మన పాలకులు ఎంతసేపు రాష్ట్రంలో తమ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలనే చూస్తున్నారే తప్ప, ప్రజల సమస్యలను అసలు పట్టించుకోవడం లేదని తేటతెల్లమవుతోంది.  హైదరాబాద్ నుంచి డిల్లీ కి ఎన్ని సార్లు చక్కర్లు కొట్టినా, ఏనాడు అయినా ప్రజా సమస్యల గురించి కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడినట్టు కనిపించిన దాఖరాలు లేవు.  ఎప్పుడూ "జగన్ ని ఎలా కట్టడి చేయాలి? తెలంగాణా లో పార్టీని ఎలా బ్రతికించుకోవాలి? 2014లో మళ్ళీ అధికారంలోకి ఎలా రావాలి?"అని ఆలోచిస్తున్నారే కానీ, ప్రజల సమస్యల గురించి  అసలు పట్టించుకోవడం లేదు. ఏ పార్టీ అయినా మనుగడ సాధించాలంటే అన్ని వర్గాల ప్రజల కష్టనష్టాలను తెలుసుకుని, వాటిని పరిష్కరించడంలో చొరవ చూపాలి.