సప్తగిరులు

శ్రీమహావిష్ణువు శయనించిన ఆదిశేషుని ఏడుపడగలే తిరుమలలో కలియుగ దైవం శ్రీనివాసుడు కొలువై ఉన్న సప్తగిరులని పురాణలు చెబుతున్నాయి. పచ్చనిలోయలు, జలపాతాలు, అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే సప్తగిరులు.