Friday 18 May 2012

వైభవంగా పూర్ణాహుతి హోమాలు


శ్రీ దుర్గేశ్వరరావు గారి ఆధ్వర్యంలో బుధవారం శ్రీ వేంకటేశ్వర జగన్మాత పీఠంలో జరిగిన హనుమత్ రక్షాయాగం వైభవంగా జరిగింది. మంగళవారం రాత్రి భారీవర్షం కురిసినా బుధవారం ఉదయం ఆటంకం లేకుండా 108 మంది దంపతులుపాల్గొనగా పూర్ణాహుతి హోమాలు  విజయవంతం గా నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన భక్తులందరికీ భోజన వసతి కల్పించడం, రెండు వేలమందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.   కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన   శ్రీ దుర్గేశ్వరరావు గారికి ధన్యవాదాలు.