”శోధిని”

Sunday 25 March 2018

కలియుగ దైవం

నల్లనివాడు, పద్మనయనాలు కలవాడు శ్రీ వేంకటేశ్వరుడు ఎంతో  అందంగా, నిత్యం అద్వితీయ తేజస్సుతో విరాజిల్లుతుంటాడు.  ఇంత దివ్యమంగళ స్వరూపం మరేదేవుడికి లేదని చెప్పవచ్చు.  అందుకే భక్తులు కన్నార్పకుండా చూస్తూ ఆయన ఆకర్షణలోపడి తామని తాము మరచిపోతుంటారు.  స్వామి అంత  మనోహర సుందరమూర్తి మరెక్కడా కానరాడు.  అందువల్లే ఈ కలియుగంలో  ప్రత్యక్షదైవం జగన్మోహనుడయి,   భక్తుల గుండెల్లో కొలువయ్యాడు.  తలచుకోగానే కళ్ళముందు స్వామి దివ్యమంగళ స్వరూపం  సాక్షాత్కరిస్తుంది.  గుండెల్లో దివ్యానుభూతిని గుబాళింపజేస్తుంది.  తిరుమలతో  సమానమైన ప్రదేశం ప్రపంచంలో మరొకటిలేదు.  వెంకటేశునితో సమానమైన దేవుడు గతంలో లేడు, భవిష్యత్తులో కూడా ఉండబోడు. 


No comments: