”శోధిని”

Monday 14 August 2017

"స్వాతంత్ర్యయోధుల త్యాగఫలం ...సర్వజనులకిది పర్వదినం"

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే మనకి గుర్తుకొచ్చేది స్వాతంత్ర్య సమరయోధులు. అహింసాయుత మార్గంలో ఎందరో మహానుభావులు మన దేశానికి స్వేచ్చను అందించారు. జాతి, కులం,మతం, ప్రాంతం అనే తేడాలనేవి లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందోత్సాలతో జరుపుకునే స్వాతంత్ర్య దినోత్సవ పర్వదినం....స్వాతంత్ర్యవీరుల త్యాగఫలం. ఆగస్టు 15 మన దేశ చరిత్రలో మరచిపోలేని ఒక అపురూపమైన రోజు. తెల్లదొరల నిరంకుశ పాలనకు తెరపడి, మన దేశానికి విముక్తి లభించిన రోజు. ఈ సందర్భంగా స్వాతంత్ర్యం సాదించడానికి కృషిచేసిన త్యాగమూర్తులను గుర్తుచేసుకుందాం... వారిని మన హృదయంలో నిలుపుకొని వందనం అర్పిస్తాం. అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు !

No comments: