”శోధిని”

Tuesday 28 March 2017

తెలుగు నూతన సంవత్సరానికి శుభోదయం !

ఋతువులలో ఎంతో సుందరమైనది వసంత రుతువు. ఈ ఋతువు వస్తూ... వస్తూ... తెలుగువారి నూతన సంవత్సరం 'ఉగాది'ని తెస్తుంది.  ఆమని రాకతో ప్రకృతి పరవశిస్తుంది....పుడమి  పులకించిపోతుంది.  ప్రకృతి కాంత  కొత్త రంగులు పులుముకొని నూతనత్వానికి నాంది  పలుకుతుంది.  హరిత వర్ణపు శోభతో...  చిగురించిన లేత ఆకులతో... లోకమంతా పచ్చగా నవనవలాడుతూ కనపడుతుంది.  వసంత ఋతువులో ప్రకృతి తన అందాన్ని చూసుకుని మురిసిపోతుంది.  వేప పువ్వులు , మామిడి పువ్వులు, లేత చిగుళ్ళు , జాజి, మల్లెల సువాసనలతో పరిసరాలన్నీ ఘుమఘుమలాడుతూ శోభాయమానంగా కనిపిస్తాయి.  లేత చిగుళ్ళు తింటూ మత్తుగా కూసే కోయిల పాట వినడానికి ఎంతో ఇంపుగా ఉంటుంది.  కొత్త బెల్లం, కొత్త చింతపండు , మామిడి కాయలు , వేపపువ్వు, ఉప్పు, కారంతో తయారు చేసిన ఉగాది పచ్చడి ఒక దివ్య ఔషదం. షడ్రుచులలాగే జీవితంలో ఎదురయ్యే సుఖదుఃఖాలను, మంచిచెడులను దైర్యంగా ఎదుర్కొని జీవించడానికి సిద్దంగా ఉండాలని ఈ ఉగాది పచ్చడి అర్థం.  తెలుగు ప్రజలంతా మన సంస్కృతీ సంప్రదాయాలతో  ఆనందంగా జరుపుకునే పండుగ 'ఉగాది' పర్వదినం. తెలుగువారి నూతన సంవత్సరం ప్రతి మనిషిలోనూ నూతనత్వాన్ని నింపాలని మనసారా కోరుకుందాం.

No comments: