”శోధిని”

Tuesday 30 June 2015

తులసి


భారతీయ సంస్కృతిలో  తులసికి ప్రత్యేకస్థానం ఉంది.  హిందువులు తులసిని పరమ పవిత్రంగా భావిస్తారు.  అంతేకాదు ఆరోగ్యప్రదాయని.... చక్కని ఔషదం కూడా.  అది ఎన్నోమొండి  రోగాలను నయం చేస్తుంది.  రోజూ కొన్ని ఆకులు నమిలి మింగితే  వ్యాధుల దరిచేరవంటారు.  మనవ శరీరంలో శ్లేష్మం పెరిగి శ్వాస ఆడక ప్రాణం పోతుంటే, తులసి తీర్థం తగిలి శ్లేష్మం విరిగి మనిషి బ్రతికిన సందర్భాలున్నాయి. అందుకే మనిషి తుదిశ్వాస విడిచేటప్పుడు తులసి తీర్థం గొంతులో పోస్తారు.  ఇంత పవిత్రమైనది కాబట్టి దేవాలయాలలో భగవంతుని తీర్థంగా భక్తులు స్వీకరిస్తారు.

Sunday 28 June 2015

మన భద్రత మన చేతుల్లోనే ...


ఓ కుటుంబ యజమాని  కుటుంబ సభ్యులతో మోటారు బైక్ మీద ఎలాంటి రక్షణ లేకుండా వెళ్ళడం చూస్తున్నాం. ఇది ఎంత ప్రమాదమో ఆ యజమాని ఆలోచించడం లేదు.  పిల్లలకు జాగ్రత్తలు చెప్పాల్సిన వాళ్ళే ఇంత రిస్క్ తీసుకొని ప్రయాణం చేయడం, ప్రమాదంతో పరాచకాలు ఆడటమే అవుతుంది.



Saturday 27 June 2015

విమాన వెంకటేశ్వర స్వామి

తిరుమలలో శ్రీవారిని దర్శించి బయటకు వచ్చేటప్పుడు ఉత్తర దిశలో "విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించండి" అని బాణం గుర్తు చూపుతూ బోర్డు ఉంటుంది.  విమాన వెంకటేశ్వర స్వామికి వెండి మకర తోరణాన్నిఏర్పాటుచేయడాన్నిగమనించవచ్చు.  విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తే,  మూలవిరాటైన శ్రీవారిని దర్శించినంత పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.  సరిగా స్వామివారి దర్శనం కలగనప్పుడు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించి తరించవచ్చు.


Friday 26 June 2015

ఆహ్లాదం !


నీలాకాశంలో నీలిమబ్బులు
కదలాడుతున్న వేళ...
చల్లని గాలులు మేనును తాకగా...
చిరుజల్లులు అక్షింతలై పలకరించగా ...
ఆహ్లాదకరమైన వాతావరణం
నయనానందకరం !

Sunday 21 June 2015

మార్గదర్శకం !


అమ్మ మనసు...
మల్లెలంత తెల్లదనం !
నాన్న హృదయం...
వెన్నెలంత చల్లదనం !
అమ్మ మమకారం...
నాన్న సహకారం !
అమ్మ త్యాగం...
నాన్న అభయం !
తల్లి దీవెన...
తండ్రి ఆదరణ !
అమ్మ తోడు...
నాన్న నీడ !
అమ్మతో  సమానంగా
ప్రేమను పంచే  ఆదర్శముర్తి నాన్న!
బిడ్డలకు మార్గదర్శకం నాన్న !!

యోగామృతం !



'యోగ' అనేది ఏ మతానికో, సంస్కృతికో సంబంధించింది కాదు.  ఇది  సర్వజనుల శరీర ఆరోగ్యానికి సంబందించినది.  మనిషి ఒత్తడిని తగ్గించి, శరీరానికి, మనసుకు  అవసరమైన ప్రశాంతతను అందించే సంజీవిని.  ప్రకాశవంతమైన ప్రేమకాంతిని వెదజల్లి, వ్యక్తి చుట్టూ ప్రశాంతమైన, పరిపూర్ణమైన వాతావరణాన్ని కలిగించే అమృతవాహిని.  అంతేకాకుండా  అసూయ, ద్వేషం, భయం, శోకం, దుఃఖం వంటి మానసిక ఆందోళనలను తగ్గించి  కుళ్ళు,  కుతంత్రాలను దూరం చేసే సంపూర్ణ ఆరోద్యప్రదాయిని.  శరీరాన్ని తేలిక పరచి జీవనశైలిలో మంచి మార్పును తీసుకొచ్చి, అనేక రుగ్మతలకు పరిష్కారం చూపే   గొప్ప సాధనం 'యోగ'.



Tuesday 16 June 2015

కమ్మని మట్టి పరిమళాలు !


నింగి నిండా మేఘమాలికలు
కమ్ముకోగా మెరిసింది మెరుపు
ఆహ్లాదకరమైన చల్లని గాలులు
ప్రకృతి అంతా విస్తరించగా ...
వెలసింది సప్తవర్ణాల హరివిల్లు !
ఆ అపురూప దృశ్యాన్ని చూసి
దేవతలు అక్షింతలు చల్లి దీవించినట్లు
నింగి నేలను కలుపుతూ...
కురిశాయి తొలకరిజల్లులు !
పుడమితల్లి ఆనందంతో పులకించి
మట్టి పరిమళాలను వెదజల్లగా ...
కమ్మని వాసన పరిసరాలను
మురిపించింది ...మైమరపించింది!


Thursday 11 June 2015

ముసుగు దొంగలు (జోక్)

మంత్రిగారి భార్య  తన భర్తతో కలసి న్యూస్ ఛానల్ చూస్తోంది.
బ్యాంక్ చోరి కేసు నిందుతులకు ముసుగేసి మీడియా సమావేశంలో ప్రవేశ పెట్టారు పోలీసులు.
మంత్రి గారి భార్య : ఏమండీ నాదొక అనుమానం
మంత్రి : ఏమిటది ?
మంత్రిగారి భార్య : పట్టుపడ్డ దొంగలకు ఇలా ముసుగేసి చూపించడం ఎందుకని ?
మంత్రి  : "పిచ్చి మొహమా ... పూర్వం నాకు కూడా ఇలాగే ముసుగేసి తీసుకెళ్ళారు కాబట్టి, ఇప్పుడు మంత్రినయినా  నన్నెవరూ గుర్తుపట్టడం లేదు"  అసలు విషయం చెప్పాడు మంత్రిగారు.







Sunday 7 June 2015

పంచభూత లింగాలు !


పంచభూతాత్మక స్వరూపుడు పరమశివుడు.   పంచలింగ ప్రతీకలే పంచభూత లింగాలు.  కంచిలో స్వామి పృధ్వీలింగ రూపంలో,  తిరువన్నామలైలో అరుణాచలేశ్వరుడు అగ్నికి ప్రతీకగా,  జంబుకేశ్వరంలో జలలింగంగా, శ్రీకాళహస్తిలో వాయులింగంగా, చిదంబరంలో ఆకాశలింగంగా మహాశివుడు పూజలు  అందుకుంటున్నాడు.  దోసెడు నీళ్ళతో అభిషేకం ...చిటెకెడు బూడిద అలంకారం ...శంభో శంకర అంటే చాలు, అంతకు మించి ఏమి కోరుకోని భోళాశంకరుడు ఆయన.    


Friday 5 June 2015

పర్యావరణ పరిరక్షణ ...ప్రగతికి సోపానం !


పర్యావరణాన్ని పరిరక్షించాలంటే...  మనసున్న ప్రతి ఒక్కరూ ప్రకృతితో యుద్ధం చేయడం ఆపి సహజీవనం చేయాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి భాద్యతగా మందుకు రావాలి.    కొండలను పిండి చేయడం మానుకోవాలి.  నదులను స్వేచ్చగా పారనివ్వాలి.  అడవులను  నాశనం చేయడం ఆపాలి.  జంతువులను స్వేచ్చగా తిరగనివ్వాలి.  మొక్కలను నాటి పరిసరాలంతటా పచ్చదనాన్ని  నింపాలి.  నింగి నుండి రాలే ప్రతి నీటి బొట్టును పుడమిలో భద్రంగా దాచాలి.  పర్యావరణానికి ముప్పు వాటిల్లినప్పుడు అకాలవర్షలు అతలాకుతలం చేస్తాయి.  మండే ఎండలు మనుషుల్ని మాడ్చేస్తాయి. కొత్త కొత్త వ్యాధులు పుట్టుకొస్తాయి.  ఋతుపవనాలు గతి తప్పి భూగోళం వేడెక్కుతుంది.  ఇప్పుడయినా  మనిషి మేల్కొనక పొతే రాబోయే  రోజుల్లో మనిషి మనుగడ అసాధ్యం.  రాబోవు తరాల వారిని దృష్టిలో పెట్టుకొని  వారి క్షేమం కోసం హరిత ప్రకృతిని కాపాడుదాం. 


Thursday 4 June 2015