”శోధిని”

Saturday 31 December 2011

ఆంగ్ల నూతన సంవత్సరానికి ఆహ్వానం!



పాత సంవత్సరానికి (2011) వీడ్కోలు చెబుతూ మనసునిండా కొత్త ఆలోచనలతో ఆంగ్ల నూతన సంవత్సరానికి (2012) ఆహ్వానం!  గత సంవత్సరంలో జరిగిన చెడును మరచి పోయి, మంచిని గుర్తుచేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి కొత్త ఆశలతో అడుగు పెడదాం.   నూతన సంవత్సరం బ్లాగ్ మిత్రులందరికీ సకల శుభాలు కలగాలని ఆశిస్తున్నాను.  మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర (2012) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!

Wednesday 28 December 2011

నిషేధం కేసు వీగిపోయింది

జ్ఞానామృత సారం అయిన భగవద్గీతను  తీవ్రవాద సాహిత్యమని , రష్యాలో నిషేదించాలని
కొందరు రష్యన్లు కోర్టులో కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే భగవద్గీతలో శ్రీకృష్ణుడు
హింసను ప్రేరేపించలేదని, రాయబారానికి కౌరవులు అంగీకరించక పోవడంతో మరో గత్యంత
లేకనే పాండవులతో యుద్ధం చేయించాడన్న విషయాన్ని రష్యన్లు అపార్థం చేసుకున్నారు.
రష్యా కోర్టు భగవద్గీతను బాగా పరిశీలించి కేసును కొట్టివేసిందని తెలిసింది.  ఇది
భారత ప్రజల విజయం.  భగవద్గీత తీవ్రవాద సాహిత్యం కాదని, అదొక ఆధ్యాత్మిక మకరందమని,
మానవాళికి శాశ్వత మణిదీపం అని రష్యన్లు తెలుసుకుంటే మంచిది.


Saturday 24 December 2011

'క్రిస్మన్' శుభాకాంక్షలు.

క్రిస్మస్ అటే దైవత్వం మానవత్వంలోకి ప్రవేసించిన రోజు. అందుకే ఈరోజు క్రైస్తవ సోదరసోదరీమణులు
భక్తితో పండుగ చేసుకుంటారు. అయితే విచిత్రమేమిటంటే ఈ పండుగలో ఏసుక్రీస్తు కంటే శాంటక్లాజ్,
క్రిస్మస్ ట్రీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండంతో అసలు సంగతి మరుగున పడిపోతోంది. ఏసుక్రీస్తుకి వేడుకలు,ఆర్భాటాలు అసలు నచ్చవు.
ఆయన ఒక మామూలు మనిషిగా సాటి మనిషిని ప్రేమించమని చెప్పాడు. అందుకే ఆయన భోధనలు ప్రపంచాన్నంతా ప్రభావితం చేశాయి. ఈలోకంలోకి లోకరక్షకుడిగా వచ్చినందుకు ఏసుక్రీస్తును హృదయంలోకి చేర్చుకుని ఆరాదిస్తారు. అందుకే క్రిస్మస్ ను ఆరాధనాభావంతో చేసుకోవాలి. క్రిస్మస్ నాడు దేవుని వాక్యానికే ప్రాధాన్యత ఇవ్వాలి. క్రీస్తుని ఆరాధించడానికి తాపత్రయపడాలి. ప్రభువైన ఏసుక్రీస్తు ఆర్భాటాలకోసంఈ లోకం రాలేదని, సత్యసువార్తను ప్రజలకు భోదించడానికి వచ్చాడని తెలుసుకోవాలి. " నీపట్ల నీవు ఎలా ప్రవర్తించుకుంటారో ఇతరుల పట్ల అలాగే వ్యవహరించు. పోరుగువారిని నీలాగా భావించి ప్రేమించు." ఇలాంటి వాక్యాలు కోకొల్లలు. హిందువులు 'శివరాత్రి'ని ఎంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారో, ముస్లీములు 'రంజాన్' ఎంత పవిత్రంగా చేసుకుంటారో అంతే భక్తి శ్రద్దలతో క్రైస్తవులు పవిత్రంగా జరుపుకునే పండుగ క్రిస్మస్. క్రైస్తవ సోదరసోదరీమణులకు 'క్రిస్మన్' శుభాకాంక్షలు.

Sunday 18 December 2011

భగవద్గీత పైన నిషేధమా?


రష్యాలో భగవద్గీతను నిషేధించాలంటూ కొన్ని సంస్థలు
కోర్టుకి వెళ్ళడం భారతీయులందరినీ అవమానించడమే
అవుతుంది. ఈ దురదృష్టకరమైన వార్త హిందూ మనోభావాలను
దెబ్బతీస్తుంది.  భగవద్గీతను తీవ్రవాద సాహిత్యమంటున్నరష్యన్లు
నిజంగానే పిచ్చివాళ్ళు. ఈ దుశ్చర్యను ప్రతి భారత పౌరుడు  తీవ్రంగా
ఖండించాలి. మనదేశంలో పుట్టిన భగవద్గీతను నిషేధించడానికి
వాళ్ళెవరు?  వెంటనే మన భారత ప్రభుత్వం స్పందించి "భగవద్గీత
పవిత్రమైన గ్రంధం " అని దౌత్యపరంగా ఆ మూర్ఖులకు తెలియచెప్పాలి.

Sunday 11 December 2011

బ్లాగర్లందరికీ అభినందనలు.

బ్లాగుల దినోత్సవం సందర్భంగా శ్రీ వీవెస్ గారి ఆధ్వర్యంలో ఆదివారం 
(11-12-11) నాడు జరిగిన సమావేశానికి దాదాపు పాతికమంది బ్లాగర్లు 
పాల్గొన్నారు.  కాని ఈ సమావేశంలో స్త్రీ బ్లాగర్లు లేని కొరత కొట్టొచ్చినట్లు
కనబడింది. కేవలం  ఇద్దరు స్త్రీ బ్లాగర్లు మాత్రమే హాజరయ్యారు. దాదాపు 
మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశం చాలా సరదాగా నడిచింది.
హాజరయిన బ్లాగర్లందరూ సభ చివరి వరకు  ఎంతో ఉల్లాసంగా గడిపారు. 
సభ నిర్వాహకులు శ్రీ కశ్యప్ గారు "చాయ్...చాయ్ ..." అంటూ అందరిని 
నవ్వించారు. శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు గారు ఈ సమావేశంలో ప్రత్యేక
ఆకర్షణగా నిలిచారు. సభ్యుల చిరునామాలు నమోదు చేయడం,  ప్రతి 
బ్లాగర్ని పలుకరించి ఫోటోలు తీయడం చూస్తుంటే తెలుగు బ్లాగర్ల పైన 
ఆయనకు ఎంత అభిమానంముందో అర్థమవుతుంది.  మార్కాపురం 
నుంచి విచ్చేసిన శ్రీ రవిశేఖర్ రెడ్డి గారు బ్లాగర్లందరికి ఉపయోగపడే 
మఖ్య విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. శ్రీమతి అపర్ణ గారు తన బ్లాగ్
గురించి, శ్రీ పంతుల గోపాలకృష్ణ  గారు తన బ్లాగ్ "అపురూపం" గురించి 
ఇలా సమావేశానికి హాజరయిన బ్లాగర్లందరూ తమ తమ బ్లాగర్ల గురించి 
వివరించారు.  తెలుగు బ్లాగుల దినోత్సవాన్ని విజయవంతం చేసిన 
బ్లాగర్లందరికీ పేరు పేరున అభినందనలు.

Saturday 10 December 2011

తెలుగు బ్లాగుల దినోత్సవం

నేడు ( డిసెంబర్ 11 ) తెలుగు బ్లాగుల దినోత్సవం 
సందర్భంగా తెలుగు బ్లాగు మిత్రులందరికీ శుభాకాంక్షలు!

Tuesday 6 December 2011

కాలమ్ సైజ్ ప్రేమకథ


మనసంతా నువ్వే !
ప్రియా...!

     నీ పరిచయంతో నా బతుకు బాటలో పూతోటలు విరబూసాయి.
నీ మనసొక  ఆత్మీయ సరోవరం. సుకుమారమైన నీ నయనాల
పలకరింపులు సుమధుర మనోహరం. నీ దరహాసంలో ఏదో తెలియని
పరవశం.  నీ స్వరం వింటే కోకిలగొంతు కుడా మూగబోతుంది.
నీలోని ప్రతి అంశం నన్ను మైమరపించాయి.  నీ హావభావాలు నన్ను
మంత్రముగ్దున్ని చేసాయి.  నా మనసంతా నువ్వే నిండిపోయావు.
నా ఉచ్వాస నిశ్వాసాల్లో నిన్ను తప్ప మరేవరిని తలుచుకోలేనంతగా
నీ ప్రేమకు దాసుడయి పోయాను.  మన ప్రేమబంధాన్ని చూసి
ఒర్వలేనివాళ్ళు ఒక పథకం ప్రకారం మన మధ్య చిచ్చు పెట్టారు.
వారి మాయలో పడి మన ప్రేమను నిర్లక్ష్యం చేసావు. అప్పటినుంచి
నాతో ముభావంగా ఉంటున్నావు. నీతో ఏ విధంగా వ్యవహరించాలో
తెలియక నా హృదయం గాలిలో దీపంలా కొట్టుకుంటోంది.  మనం
ఎంచుకున్న అభిలాషలు , లక్ష్యాలు మన జీవితాన్ని నడిపించే
ఇందనాలుగా పనిచేయాలి. అవి కొరబడితే జీవితం నిస్సారంగా,
అర్ధరహితంగా ఉంటాయనడానికి మనమే ఒక నిదర్శనం.  ఎందుకంటే
ప్రేమంటే నీ దృష్టిలో నిర్లక్ష్యం. కాని నా దృష్టిలో మాత్రం అదొక త్యాగం.
ప్రేమంటే శారీరక సంబంధం అనుకుంటావు. నేను మాత్రం పవిత్రమైన
స్నేహబంధం అనుకుంటాను. ప్రేమ మనసులోంచి పుట్టాలి.  గుండె
లోతుల్లోంచి ఉబకాలి. అదే శాశ్వత ప్రేమ అవుతుంది. అలాంటి ప్రేమ
కోసమే నీతో పరిచయం పెంచుకున్నాను. కలిసున్నవాళ్ళంతా
ప్రేమికులు కాలేరని, కలిసి పనిచేసే వాళ్ళంతా సన్నిహితులు కాలేరని
తెలుసుకున్నాను.  స్వచ్చమైన ప్రేమను ఎవ్వరూ నమ్మరు. నటించే
వారివైపు పరుగులు తీస్తారు. మనం  ఇష్టపడే వాళ్ళను కాకుండా
మనల్ని ప్రేమించే వాళ్ళను ప్రేమించాలనే నగ్నసత్యాన్ని తెలుసుకున్నాను.
నీ కిష్టమైన వారిని ప్రేమించు.  కేవలం ప్రేమిస్తే సరిపోదు. ఆప్రేమను
జీవితాంతం కంటికి రెప్పలా చూసుకోవాలని నా కోరిక.  నువ్వు నా
జీవితంలో ఓ మంచి స్నేహితురాలిగా మిగిలిపోతే చాలు.
ఇట్లు
ఎప్పుడూ నీ క్షేమాన్ని కోరే ....

Friday 2 December 2011

ఇదిగో, ఇదీ దారి!

image.png

ఇదిగో, ఇదీ దారి!

హైదరాబాద్, December 2nd, 2011
తెలుగు భాష ఎప్పుడు ఎలా పుట్టింది అని జుట్టు పీక్కునే బదులు ఇప్పుడు తెలుగు భాషను ఎలా బ్రతికించుకోవాలి? తెలుగు భాష వాడకానికి తీసుకోవలసిన చర్యలు గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఏ భాషను ఆదరిస్తే ప్రజలు ఆ భాషపైన మక్కువ చూపుతారు. మనం ఆంగ్ల భాష వైపు పరుగులు తీస్తున్నామంటే, దానికి కారణం మన ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలలో తెలుగు భాషకి ప్రాధాన్యత ఇస్తూ, ప్రభుత్వ కార్యాలయాలలో తెలుగు వాడకాన్ని ప్రవేశపెడితే తప్పకుండా ప్రజలలో మార్పు వస్తుంది. తప్పనిసరిగా ఉద్యోగులకు తెలుగు రాయడం, చదవడం తెలిసుండాలనే నిబంధన వుంటే! ఈ స్థితి వచ్చేదా? ప్రభుత్వ కార్యాలయాల్లో అన్ని స్థాయిల్లో విధిగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా సరళమైన తెలుగు భాషను అమలుపరచాలి. అధికార పత్రాలు, ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలు మాతృభాషలో ముద్రించి, అందిరికీ అర్థమయ్యేలాచేయాలి.
నేటి తరానికి తెలుగు భాష పైన మక్కువ పెంచాలంటే, తెలుగు భాష సరళంగా ఉండాలి. తెలుగు భాష కనుమరుగు కాకుండా వుండాలంటే, ప్రభుత్వ, కార్పొరేట్ కళాశాల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలుగు బోధించడాన్ని తప్పనిసరి చేయాలి. తెలుగు భాషపట్ల అభిరుచి కలిగేలా తెలుగు పాఠ్య పుస్తకాల రచనా నిర్మాణం జరగాలి. తెలుగు భాష గొప్పదనాన్ని, అందులోని మాధుర్యాన్ని విద్యార్థులకు తెలియజెప్పాలి.
టీవీ ఛానల్ వాళ్లకి తెలుగు భాషలో పదాలు లేనట్టు ఆంగ్ల పదాలతో కార్యక్రమాలను తయారుచేసి ప్రజల మీద రుద్దడం మానుకోవాలి. తారల ఇంటర్వ్యూలు, వక్తల ప్రసంగాలలోనూ ఆంగ్ల పదాలు మేళవిస్తూ అతి చక్కని తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పటికే టీవీ ఛానళ్ల పుణ్యమా అని హిందూ స్ర్తిలలో కొందరు నుదుటున బొట్టు పెట్టుకోవడం మానేశారు. టీవీ ఛానల్ వాళ్లు ప్రసారం చేసే కార్యక్రమాల్లో తెలుగు సంప్రదాయాలు మచ్చుకైనా కనిపించవు. ఇప్పటికైనాతెలుగు టీవీ ఛానళ్ల వారు కళ్ళు తెరచి, పరభాషా వ్యామోహాన్ని తగ్గించి, తెలుగు భాషలోని మాధుర్యాన్ని, ఉచ్చారణను, తెలుగువారి సంప్రదాయాలను ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. మాతృభాషలో పరిపాలన, కళాశాలలో మాతృభాషలో బోధన, టీవీ ఛానళ్ళలో తెలుగు సంప్రదాయ కార్యక్రమాలు ప్రవేశపెట్టినప్పుడు మన తెలుగు భాషకు పూర్వవైభవం వస్తుంది.

Thursday 1 December 2011

ఎయిడ్స్ ఫై అవగాహన పెరగాలి

నేడు అత్యధికులు లైంగిక సంపర్కం వల్ల ఎయిడ్స్ అనే మహమ్మారి
బారిన పడుతున్నారు.  విచ్చలివిడి శృంగారం ద్వారా ఒకరికంటే
ఎక్కువ మందితో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వలన ఎయిడ్స్
అనే ప్రాణాంతక వ్యాధి సంక్రమిస్తోంది. అంతేకాకుండా పచ్చబొట్లు
పొడిపించుకోవడం,ఒకరికి ఉపయోగించిన సూదిని మరొకరికి ఉపయోగిండడం,
వ్యాధిగ్రస్తుని రక్తదానం, ఇంజక్షన్లు, షేవింగ్ ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి
చెందడానికి అవకాశాలు ఎక్కువ కాబట్టి ఇలాంటి విషయాలలో ప్రతి ఒక్కరూ
అప్రమత్తతతో మెలగాలి.  ఇప్పటివరకు ఎయిడ్స్ కి సరయిన ట్రీట్మెంట్
లేదు కాబట్టి దానిని నివారించడమే ఉత్తమ మార్గం.  ఈ ఎయిడ్స్ సోకిని
వారితో కరచాలం చేయడం, కలిసి భోజనం చేయడం, కలిసి  పనిచేయడం
ద్వారా ఎయిడ్స్ వ్యాపించదు.  టాయిలెట్లు, బాత్రూములు కలిసి  వాడటం
వలన ఈ వ్యాధి వ్యాప్తి చెందదు. అంతేకాకుండా దోమకాటు, గాలి పీల్చడం
వంటి వాటి  వలన కుడా ఎయిడ్స్ రాదు కాబట్టి ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను
సమాజంలో నిరాదారణకు గురికాకుండా చూడాల్సిన భాద్యత  ప్రతి పౌరుడి
మీద ఉంది.  ఎయిడ్స్ భాదితులకు ప్రేమాభిమానాలు పంచి,  మనలో ఒకరిగా 
చూడటం వలన  వారు మరికొన్ని సంవత్సరాలు జీవించడానికి అవకాశం
ఉంది.  ఎయిడ్స్ వ్యాధి పైన ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే ఈ వ్యాధిని
చాలావరకు నివారించవచ్చు.

Sunday 20 November 2011

అధికార దాహం

ఆనాడు ఆంగ్లేయుల పాలన
అంతమైనదని ఆనందించాం!
ఈనాడు విదేశీయుల
పంచన పడి రోధిస్తున్నాం!!
ప్రపంచీకరణ ధాటికి
మాయమై పోతున్నాయి పల్లెలు!
ప్రపంచ బ్యాంకు షరతులకు
రోడ్డున పడుతున్నారు ప్రజలు !!
పాలకుల గుప్పిట్లో ---
ప్రజలు తోలుబొమ్మలు!
వరల్డ్ బ్యాంకు చేతుల్లో---
పాలకులు కీలుబొమ్మలు!!
తెల్లదొరల అమానుషం
అంతమైనదనుకుంటే ---
నల్లదొరల అధికార దాహం
అన్నిరంగాల్లో మొదలయింది
మనదేశాన్ని రక్షించడానికి---
మన జాతీయ గౌరవాన్నికాపాడటానికి---
మరో జాతిపిత కావాలి.


Thursday 17 November 2011

కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం 'శ్రీ రామరాజ్యం'



ఈ రోజు (17-11-11) విడుదలైన శ్రీ రామరాజ్యం చిత్రం, నేడు వస్తున్న
రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంది.  ఈ చిత్రాన్ని చూస్తున్నంత సేపు     
మరో 'లవకుశ' ను చూస్తున్నట్టు ఉంది.  ఇలాంటి దృశ్య కావ్యాలను
శ్రీ బాపు గారే తీస్తారని మరోసారి నిరూపించారు.  శ్రీరాముని గెటప్ లో
బాలకృష్ణ గారి నటన నభూతో నభవిష్యతిగా ఉంది.  శ్రీరాముడి పాత్రకి
జీవం పోశారు. ప్రతి సన్నివేశంలోనూ  తన తండ్రిగారిని గుర్తుకు తెచ్చారు.
శ్రీ నాగేశ్వరరావు గారు, నయనతార, శ్రీకాంత్ లు తమ పాత్రలకు పూర్తి
న్యాయం చేసారు.  ఇప్పుడొస్తున్న సినిమాలలో మన సంప్రదాయాలు
కాగడా పెట్టి వెతికినా కానరావు.  అలాంటి విలువలున్న 'శ్రీ రామరాజ్యం'
చిత్రం రావడం ఆనందదాయకం. ఇళయరాజా సంగీతం ఈ సినిమాకు
ప్రత్యేక ఆకర్షణ. పాటల చిత్రీకరణ బాగుంది.  తెర పైన పాటలన్నీ బాగున్నాయి.
ఈ తరం వారిని ఆకట్టుకునే విధంగా రూపుదిద్దుకున్న 'శ్రీ రామరాజ్యం'
కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రం.

Thursday 10 November 2011

ప్రేమంటే ఇదేనా?

నా హృదయంలో 
ప్రేమదీపాన్ని వెలిగించి 
నా ఊపిరిలో 
వెచ్చని జ్ఞాపకం అయ్యావు
మోడుబారిన 
నా మనసును కరిగించి
నా గళంలో 
అమృత ధారవయ్యవు
ఆప్యాయత, అనురాగాల్ని పంచి 
నా జీవితాన్ని 
నందనవనం చేశావు
నా ప్రాణానికి ప్రాణమై 
నాలో ఎన్నో ఆశలు పెంచి 
అనుకోకుండా దూరమయ్యావు 
ప్రియతమా!
ప్రేమంటే ఇదేనా ?
ఒక్కసారి ఆలోచించు 
మన  ప్రేమను బ్రతికించు.

Sunday 6 November 2011

ముస్లిం సోదరులకు 'బక్రీద్' పండుగ శుభాకాంక్షలు!


త్యాగానికి ప్రతీకగా ముస్లిం సోదరులు  జరుపుకునే 
'బక్రీద్' పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు 
శుభాకాంక్షలు.

Thursday 3 November 2011

'డెంగీ' కి తోడు 'హంటా వైరస్'

రాష్ట్రము మాయదారి రోగాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఒక పక్క 'డెంగీ' జ్వరం పంజా విసరడంతో ప్రజలు అల్లాడుతుంటే మరోపక్క దీనికితోడుగా 'హంటా' అనే మాయరోగం వచ్చి చేరింది.  ఈ వ్యాధి ఎలుకల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందని, ఇంతవరకూ 'హంటా' కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదని, ముందు జాగ్రత్తలే మేలని డాక్టర్లు అంటున్నారు. 'డెంగీ' మాదిరిగానే 'హంటా' వైరస్ వల్ల తీవ్రమైన జ్వరం, వణుకు వస్తుందని, భరించలేని ఒళ్ళు, కీళ్ళ నొప్పులతోపాటు వాంతులు అవుతుంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్శ చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎలుకలను ఇంట్లో లేకుండా చూసుకోవాలని, భోజనానికి ముందు, తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలని చెబుతున్నారు.  ప్రతి మనిషి  తాను నివసించే ఇల్లు, పరిసరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంట్లో చెత్తను పురపాలక సంఘం ఏర్పాటు చేసిన కుండీలలో  మాత్రమే వేయాలి.  ఒకవేళ ఇంటిముందు మురికి కాల్వలున్నట్లయితే అక్కడ మురికి పేరుకుపోకుండా నీటి ప్రవాహం వేగంగా సాగేటట్టు  చూడాలి.  రెండు రోజులకొకసారి బ్లీచింగ్ పౌడర్ చల్లుతుంటే ఈ వ్యాధులకు కారణమైన దోమలు దరిచేరవు. ఇలా ప్రతిఒక్కరూ జాగ్రత్తలు  తీసుకుంటే ఈ వ్యాధుల బారినుండి బయటపడవచ్చు.

Sunday 30 October 2011

నాగుల చవితి

కార్తీకమాసం   నెలరొజులూ పవిత్రమైనవే.  కార్తీకంలో శుక్ల పక్ష  చవితినాడు                                                 జరుపుకొనే పండుగ 'నాగుల చవితి'.  ఈ రోజున పెద్ద సంఖ్యలో మహిళలు 
పుట్టలో పాలు పోసి నాగదేవతను భక్తిశ్రద్దలతో పూజిస్తారు. బెల్లం,నువ్వుల 
పిండితో తయారు చేసిన చలిమిడిని నైవేద్యంగా  సమర్పిస్తారు. ఈ విదంగా
నాగదేవతను పూజిస్తే ఎన్నో ఫలితాలుంటాయని  భక్తుల  ప్రగాఢ  విశ్వాసం.
నాగులచవితి, నాగులపంచమి పవిత్రరోజులలో మాత్రమే సర్పాలను పూజించి,
మిగాతారోజులల్లో పాములు కనిపించగానే చంపడానికి ప్రయత్నం చేయకుండా 
వాటిని తోటి ప్రాణులుగా చూడాల్సిన భాద్యత మనందరిది. 


Tuesday 25 October 2011

దీపావళి శుభాకాంక్షలు!


"దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్ధన! దీపేన హరతే పాపం సంధ్యాదీప నమోస్తుతే!"

సిరిసంపదలు సమకూర్చే దీపావళి మీ ఇంట ఆనందవెలుగులు నింపాలని కోరుకుంటూ....

బ్లాగరులందరికీ దీపావళి శుభాకాంక్షలు!


Monday 24 October 2011

అమావాస్య వెన్నెల

నక్షత్రాలన్నీ దివినుంచి భువికి దిగివచ్చేరోజు, ప్రతియింటా నవ్వుల దీపాలు వెలిగేరోజు, పెద్దలు పిల్లలుగా మారేరోజు దీపావళి రోజు. దీపావళి గురించి రకరకాలుగా కథలు ఉన్నప్పటికీ అందులో నరకాసురుడి వధ ప్రధానమైనది. కాని, అన్ని కథల్లో 'చెడు' ఫై  'మంచి' చేసిన విజయమని తెలియజేస్తున్నాయి. ఈ విజయోత్సవానికి గుర్తుగా అమావాస్య నాడు ప్రతియింటా వెలుగులనునింపి, చీకటిని పారద్రోలడం  ఆనవాయితీగా వస్తోంది. అందులో భాగంగానే ఇల్లన్ని శుభ్రపరచి చక్కగా అలంకరించి, సాయంత్రం దీపాలతో వెలుగులు నింపుతారు. కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ మహాలక్ష్మి తల్లిని ఆహ్వానం పలుకుతారు.మన పండులన్నిదాదాపు సూర్యోదయంతో మొదలయితే, దీపావళి మాత్రం సూర్యాస్తమయంతో ప్రారంభం కావడం విశేషం.కులమతాలకుఅతీతంగా, పెద్దలు, పిల్లలు అంతా  ఆనదంగా జరుపుకునే పండుగ వెలుగుజిలుగుల దీపావళి. ఈ పండుగనాడు బాణా సంచా కాల్చడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే బాణా సంచా కాల్చేటప్పుడు ప్రమాదాలకు గురికాకుండా ఉండటానికి తగు జాగ్రత్తలు  తీసుకోవాలి. పిల్లలు, పెద్దలు సమక్షంలో ఆరుబైట బాణా సంచా కాల్చడం, టపాకాయలను విసిరేయకుండా ఉండడం, ప్రేలుడు టపాకాయలను తగినంత దూరంలో  ఉంచడం చేయాలి. చేతులు కాలకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలి. బాణా సంచా పేల్చడంలో జాగ్రత్తలు విస్మరిస్తే ప్రమాదాలు సంభవిస్తాయి.  తస్మాత్ జాగ్రత్త.
                    అందరికీ దీపావళి శుభాకాంక్షలు!

Thursday 20 October 2011

హిజ్రాల ఆగడాలు

జంటనగరాలలో హిజ్రాల ఆగడాలు రోజురోజుకు శ్రుతిమించిపోతున్నాయి.  రోడ్డునపోతున్నవారు  వీరిని 
చూడగానే బెంబేలు పడాల్సిన పరిస్తితి  నెలకుంది.  ఉదయం నుంచి రాత్రి వరకు డబ్బు కోసం వీరి వేధింపులు 
ఆగడం లేదు. ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు .  ఉదయమే జంటలు జంటలుగా రోడ్డుమీదికి 
వచ్చి, వారు అడిగినంత డబ్బు  ఇవ్వకపోతే వారికి చుక్కలు చూపిస్తారు. అసభ్యకర ప్రవర్తన , భూతులు 
మాట్లాడుతూ వారిని కించపరుస్తూ   రచ్చ రచ్చ చేస్తారు.  వీరిబారినుండి ఎలా తప్పించుకోవాలో తెలియక 
ప్రజలు అవస్థలు పడుతున్నారు.  హిజ్రాలందరూ  ఆరోగ్యంగానే ఉన్నారు. కస్టపడి పనిచేసుకోవడానికి 
ఎన్నో మార్గాలున్నాయి. ఇలా ప్రజలను వేదించడం ఎందుకు?  అడుక్కోవడానికి ఎన్నోమర్గాలుండగా 
ప్రజలను పీల్చి పిప్పిచేయడం ఎందుకు?  ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. హిజ్రాల
జీవనోపాధికోసం  ప్రభుత్వం తగుచర్యలు తీసుకొని హిజ్రాల ఆగడాలను అరికట్టాలి.

Wednesday 19 October 2011

టీవీల్లో వాణిజ్య ప్రకటనలు

టీవీల్లో వస్తున్న కొన్ని వస్తువుల వాణిజ్య ప్రకటనలు అభ్యంతరకరంగా ఉంటున్నాయి.  కుటుంభ సభ్యులంతా 
కలసి టీవీ చూస్తున్నప్పుడు జుగుస్సాకరమైన దృశ్యాలను ప్రసారం చేయడాన్ని నిలువరించాల్సిందే!  
సభ్యసమాజం  తలదించుకునేలా ఉంటున్న ఇలాంటి వాటిని ప్రసారాలకు ఎలా అనుమతిస్తున్నారో అర్థం 
కావడం లేదు. ప్రకటనలు వస్తు నాణ్యతకు సంబందించినదిగా ఉండాలి.  వాటి సద్గుణాలను ప్రజలకు  తెలియజేసేవిధంగా మలచాలి .  అసభ్య దృశ్యాలు  ఉన్న ప్రకటనల్ని ప్రసారం చేయడం నైతిక విలువలకు తిలోదకాలివ్వడమే అవుతుంది.  టీవీల యాజమాన్యం ఇలాంటి అసభ్యకరమైన  వాణిజ్య ప్రకటనలను 
తమ ఛానల్లో ప్రసారం చేయకుండా చూడాలి.

Tuesday 18 October 2011

మన భాష తెలుగు భాష

మా ఆఫీసులో పనిచేసే వారంతా తెలుగువారే. కాని, తెలుగు మాట్లాడితే తమ హొదాకు భంగమనుకుంటారు.      తెలుగు మాట్లాడేవారిని చూసి నవ్వుకుంటారు.  తెలుగు పదాలను హేళన చేస్తుంటారు.  పరభాషా వ్యామోహంలో     పడి మన తెలుగు భాషను చిన్న చూపు చూస్తున్నారు.  తెలుగు భాషలోని తియ్యదనం ఇలాంటివారికి ఎంత       చెప్పినా చెవిటి వాడిముందు శంఖం ఊదినట్లు అవుతుంది.  కట్టు, బొట్టు తెలుగువారిదయినప్పుడు  తెలుగులో మాట్లాడటం అవమానంగా భావించడం ఎందుకు?  గొప్పలకుపోయి  మాతృభాషను కించపరచడం ఎందుకు?  ఇలాంటివారివల్ల తెలుగు సంస్కృతులు, ఆచారవ్యవహారాలు మాయమైపోతున్నాయి.  మధురమైన తెలుగు    భాషలోని పలుకులు తేనెలొలికే గులికలని, ప్రతి తెలుగుపదం వీనులవిందుగా, వినసొంపుగా ఉంటాయని మన తెలుగువాళ్ళు తెలుసుకొనే రోజు రావాలి.   

Wednesday 12 October 2011

ప్రజల భాధలు

సకల జనుల సమ్మె కారణంగా ప్రభుత్వ కార్యాలయాలలో పనులు పూర్తిగా స్తంభించి పోయాయి.  నెల నుంచి విద్యాసంస్థలు తెరవకపోవడంతో విద్యార్థుల భవిషత్తుఫై తల్లితండ్రులు ఆందోళన చెందుతున్నారు. సమాజాన్నికలుషితం చేసే మద్యం షాపులు, సినిమాలను సమ్మెలో మినహాయించి విజ్ఞానాన్ని పంచే విద్యాసంస్థలను మూసివేయడం బాధాకరం. సమ్మె రోజురోజుకి ఉద్రుతరూపం దాల్చడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.పరిపాలనా వ్యవస్థ పూర్తిగా స్థమించి పోవడంతో అసలు ప్రభుత్వం అనేది వున్నదా అనే అనుమానం ప్రజలలో నెలకొంది. ఆర్టీసి బస్సులు తిరగకపోవడంతో ఆటోడ్రైవర్లు విపరీతంగా చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇప్పటికి అయినా ఉద్యమనేతలు స్పందించి విద్యార్థుల భవిషత్తును దృష్టిలో ఉంచుకొని సమ్మె నుంచి విద్యాసంస్థలను మినహాయింపు ఇచ్చి  ఆర్టీసి బస్సులను నడిపించి ఆటోడ్రైవర్ల బారినుంచి ప్రజలను కాపాడాలని మనవి. 

Wednesday 5 October 2011

బ్లాగు వీక్షకులకు విజయదశమి శుభాకాంక్షలు

మంచి మాటలు

"నిజం చెప్పేవాడికి పనితనం ఎక్కువ 
అబద్దాలు చెప్పేవాడికి మాటలు ఎక్కువ"

* * * * * * * * * * * *

"కుడిచేత్తో నమస్కారం సంస్కారం 
ఎడమచేత్తో నమస్కారం తిరస్కారం"

* * * * * * * * * * * *

"పొదుపుగా వాడితే దొరుకుతుంది నీరు 
దుబారా చేస్తే మిగిలేది కన్నీరు"

* * * * * * * * * * * * 

"పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భవిత 
పర్యావరణ రక్షణ మన భాధ్యత"

* * * * * * * * * * * *

Saturday 1 October 2011

మహాత్మా గాంధీ 142 వ జయంతి సందర్భంగా---!

     మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడుద్దాం!
     దేశాన్ని అభివృద్దివైపు నడిపిద్దాం!!


శ్రీ లలితాత్రిపుర సుందరీదేవి

Posted by Picasa

శ్రీ వేంకటేశ్వరుడు


Posted by Picasa

శ్రీ అన్నపూర్ణాదేవి


Posted by Picasa 

శ్రీ గాయత్రి దేవి


Posted by Picasa 

శ్రీ పెద్దమ్మ తల్లి


Posted by Picasa  

శ్రీ బాలాత్రిపురసుందరీ దేవి


Posted by Picasa 

Thursday 29 September 2011

అవినీతిని అంతం చేద్దాం!

       అన్నాహజారే ప్రారంభించిన అవినీతి ఉద్యమం యావత్ భారతావనికి స్పుర్తినిచ్చింది.  పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు అంతా అవినీతిపైనే మాట్లాడుకోవడం శుభసూచకం. నేడు దేశమంతా  అవినీతి అల్లుకుపోవడంతో దేశ ప్రతిష్ట్ట మసక బారుతోంది. అన్ని రంగాలలోను అవినీతి జలగలు పాతుకుపోయాయి. సామాన్యుడు  ప్రభుత్వ కార్యాలయాలకు పనులకోసం వెళ్ళినప్పుడు అక్కడ అవినీతిపరులతో తీవ్ర ఇబ్బందులకు గురవడం చూస్తున్నాము.ఈ అవినీతి భూతాన్ని అంతం చేయడానికి  ఒక బలమైన  స్వయం ప్రతిపత్తిగల చట్టం కావాలి. ఈ చట్టాన్ని అమలు పరచే వారిలో చిత్తశుద్ధి ఉండాలి.  దీనిపై సందేహాలుంటే, వాటిని పరిష్కరించడానికి ప్రధాన న్యాయమూర్తుల సలహాలు తీసుకోవాలి.  అవినీతిలేని సమాజాన్ని చూడాలంటే ప్రతి వ్యక్తి నీతి నిజాయితీగా ఉండాలి. వృత్తి పరంగా  అవినీతిని  ఎంతవరకు నిరోధిస్తున్నమన్నది ఎవరికివారే ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేశంలోని పతివ్యక్తి ఒక అన్నా హజారేలా మారి తమవంతు భాద్యతగా అవినీతిపై ఉద్యమించాలి.  ఇలా పతిఒక్కరు చిత్తశుద్దితో పనిచేస్తే అవినీతిరక్కసిని అంతం చేయవచ్చు.



Wednesday 28 September 2011


ప్రజల భాధలను అర్థం చేసుకోండి!

          గత రెండు వారాలనుంచి రాష్ట్ర ప్రభుత్వం  తెలంగాణా జిల్లాలలో పడకేసింది. ప్రభుత్వ సర్వీసులు కోమాలోకి వెళ్ళిపోతున్నాయి.  ప్రజలు పడే భాధలను అడిగేనాధుడే కరువయ్యారు. ఇటు రాజకీయ పార్టీలు అటు ప్రభుత్వాల నడుమ ప్రజలు నలిగి పోతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను  పరిష్కరించే వాళ్ళు లేక  అనాదులుగా మిగిలిపోతున్నారు.  ఆర్టీసి  బస్సులు తిరగకపోవడంతో ఆటో చార్జీలు విపరీతంగా  పెంచి ప్రజలను యిబ్బందికి గురి చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పజాప్రతినిధులు మాత్రం మిన్నకుండి పోవడం ప్రజల దురదృష్టం. ఇప్పటికయినా అన్నిపార్టీలు కలిసి తెలంగాణా పరిష్కారానికి కృషి చేయాలి.  రెండు ప్రాంతాలవారు  ఒకచోట సమావేసమయి ఒకరి అభిప్రాయాలను మరొకరు  తెలుసుకొని  తెలంగాణా సమస్యను  పరిష్కరించుకోవాలి. త్వరగా  కేంద్ర ప్రభుత్వం  తెలంగాణా సమస్యకు పరిష్కారం చెప్పాలని ప్రజలు వేడుకుంటున్నారు.

Tuesday 20 September 2011

మన జాతీయ గీతాన్ని తప్పులు లేకుండా పాడుదాం!


జన-గణ-మన అధినాయక, జయహే 
భారత-భాగ్య విధాతా!
పంజాబ-సింధు -గుజరాత-మరాఠా 
ద్రావిడ-ఉత్కళ బంగా 
వింధ్య-హిమాచల-యమునా-గంగా 
ఉచ్ఛల-జలధి తరంగా 
తవ శుభ నామే జాగే,
తవ శుభ ఆశిష మాంగే,
గాహే తవ జయ-గాథా
జన-గణ-మంగళ దాయక జయహే 
భారత-భాగ్య విధాతా!
జయహే, జయహే, జయహే,
జయ జయ జయ జయహేII


Wednesday 7 September 2011

హైకూలు

నీ జ్ఞాపకాలు 
సునామీ
చిక్కి బ్రతకగాలనా

****************

మైకుల బెడద 
మళ్లీ మొదలైంది 
ఉపఎన్నికలు 

****************

నీ జ్ఞాపకాల్లో 
నా కలలు ఈదుతూ
నిన్ను మరువలేక 

****************










Monday 5 September 2011

జ్ఞాపకాలు

శూన్యమై మిగిలిన 
నా జీవితంలో 
వెన్నెల దీపాలు 
వెలిగిస్తావనుకున్నాను 
కానీ----
ఆజీవితాన్నేచీకటిగా మార్చి
అందులో నన్ను బంధిస్తావనుకోలేదు
తుషార ఉదయంలాంటి 
నీ ప్రేమజల్లులో 
తడిసి పులకించి పోవాలనుకున్నాను
కానీ---
ఆప్రేమనే నువ్వు  తుపానుగా మార్చి 
సునామీ సృస్టిస్తావని
ఉహించలేదు 
ప్రియా---
నీ జ్ఞాపకాల వెల్లువలో 
నేనొక ఎగసిపడే 
కెరటానయ్యాను 
నీవులేని ఈ మనుగడకు 
నీ జ్ఞాపకాలే చాలు కడవరకు





Sunday 28 August 2011

కవితలు



నీకోసం 

స్వాతి చినుకు కోసం 
ఆర్తిగా చూసే 
ముత్యపు చిప్పలా
వసంతకాలం కోసం
ఆశగా చూసే
కోయిలలా 
రవికిరణం కోసం
కోరికగా చూసే
కమలంలా
కళ్ళనిండా 
నీరుపాన్నినింపుకుని 
మదినిండిన అనుభూతులతో 
అనుక్షణం తపిస్తున్నా
నీకోసమే జీవిస్తున్నా

********************

ప్రజలు

ప్రశ్నించడం 
మరచిపోయారు 
నిలదీయటం 
మానేసారు 
చెయ్యిచాపిన
అధికారికి 
అందించడం 
నేర్చుకున్నారు 

*******************

మన నేత 

ఎన్నికలముందు 
పున్నమి చంద్రుడిలా 
చల్లని వరాలు 
కురిపించేవాడు 
ఎన్నికల తర్వాత 
ఎండాకాలం సూర్యుడిలా 
ముచ్చెమటలు పట్టించేవాడు 

హైకూలు

హైకూలు

నిన్ను చూసింది 
ఒక్క క్షణం 
తపిస్తున్నాఅనుక్షణం 

***************

ఒక్కటే బల్బ్ 
జగమంతా వెలుగు 
నిండు చంద్రుడు 

***************

చీకటిలో 
వెతుకుతున్నా
వెలుగులా వస్తావని 

***************

రోడ్డున పడ్డారు 
త్వరలో 
ఉపఎన్నికల కోలాహం 

***************





Wednesday 24 August 2011

మినీ కవితలు


అర్ధాంగి

నీ బాగుకోసం 
కర్పురమయీ కరిగేది 
నీ పురోగతిని చూసి 
దివ్వెలా వెలిగేది 

^^^^^^^^^^^^^^^^

స్త్రీ 

ప్రేమగా చూస్తే
అవుతుంది తల్లి 
నిత్యం వేధిస్తే 
అవుతుంది కాళి

^^^^^^^^^^^^^^^

అక్షరం 
అలసట లేనిది 
ఆకాశంలా
అనంతమైనది 

^^^^^^^^^^^^^^^

నెత్తుటి  దాహంతో 
తీవ్రవాదం 
భయం గుప్పిట్లో 
ప్రజల ప్రాణం 

^^^^^^^^^^^^^^^




Tuesday 23 August 2011

ఓ వినాయక ---

"దుష్టశక్తులను  ఆదిమిపట్టు
అరాచక వ్యక్తులను తరిమికొట్టు 
దేశానికీ రక్షణ కలిగించు 
మాలో చిరుదీపం వెలిగించు"  



నా ఆలోచనలు, అభిరుచులు, అనుభూతులు, అభిప్రాయాల  సమాహారం  ఈ "తెలుగు వెన్నెల"

"తెలుగు వారికీ  నమస్కారం 
 తెలుగులో మాట్లాడటం  మన సంస్కారం "

" అమ్మను మరువకు
  అమ్మ భాషను విడవకు"